KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి అధికారులు ‘సెట్-C’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 233 మంది విద్యార్థులకు గాను 230 మంది హాజరు కాగా, ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 44వ డివిజన్లో ఉన్న మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురవుతున్నదని బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ అధికారులకు అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు శుక్రవారం 44 వ డివిజన్లోని ఆ మున్సిపల్ స్థలాన్ని TPBO అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. మున్సిపల్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.
NLG: నార్కట్పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్డులో లారీ బీభత్సం ఒక నిరుపేద కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మేడి కృష్ణ, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నలుగురు అన్నదమ్ముల్లో ఇప్పటికే ఒకరు చనిపోగా, ఇప్పుడు కృష్ణ కూడా దూరమవ్వడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
KMR: బిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. బిక్కనూరుకు చెందిన వందన స్కూటీపై మాందాపూర్ వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓమ్ని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
BDK: భూదాన్ భూముల్లో నష్టపోయిన ప్రతి బాధితుడిని న్యాయం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం స్పందించారు. ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని అన్నారు. స్థలాన్ని మోసపూరితంగా అమ్మిన వారు జైల్లో ఉంటారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
SRPT: కోదాడ పట్టణంలోని 28వ వార్డులో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను శుక్రవారం తొలగించారు. వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీను ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. విద్యుత్ అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఈ పనుల పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
దేవరకొండలో స్థానిక వీడియో, ఫోటో అసోసియేషన్ భవన అవసరాల కోసం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్ మంచినీటి బోరును వేయించి తన ఉదారతను చాటుకున్నారు. భవన నిర్మాణంలో ఎదురవుతున్న నీటి ఎద్దడిని గుర్తించిన ఆమె సొంత ఖర్చులతో బోరు వేయించి ఫోటోగ్రాఫర్లకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
HYD: నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ. 450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.
MBNR: మహిళా సాధికారతపై సమాజాభివృద్ధికి పునాది అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. నా భారత్ ఆర్థిక సహకారంతో, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహబూబ్నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి గ్రామ దుకాణాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుందని అన్నారు.
PDPL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్లో రామగుండం విద్యార్థులు సత్తా చాటారు. రామగుండం జపాన్ షిటోరియా కరాటే స్కూల్కు చెందిన ముక్తిశ్రీ 47 కేజీల విభాగంలో వెండి పతకం సాధించగా, 54 కేజీల విభాగంలో సహస్ర కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ కరాటే శ్రీనివాస్, సురేశ్,శ్రీనివాస్, శోభారాణి విజేతలను అభినందించారు.
GDWL: రాజోలి గ్రామానికి చెందిన రాజేష్ గౌడ్ (32) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కష్టపడి పైకొచ్చిన రాజేష్ మరణ వార్త విని బంధుమిత్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
RR: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీలో కొనసాగుతున్న భూగర్భ డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తమ హయాంలోనే ఈ పనులకు నిధులు మంజూరు చేయించామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
MDK: రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్లతో కలిసి సమీక్షించారు. జిల్లా ఎస్పీడీ.వి శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ట్రైనీ గ్రూప్ వన్ ఆఫీసర్ సింధు పాల్గొన్నారు.
VKB: నవాందీ రైల్వే స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ ప్రారంభమైంది. MP కొండ విశ్వేశ్వర్ రెడ్డి, MLA బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించి రైలుకు పచ్చజెండా ఊపారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్ రవాణా పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
BHPL: గణపురం మండలం నుండి హైదరాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. బస్సు సర్వీసును గణపురం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు వచ్చిన ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు.