KMR: బిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. బిక్కనూరుకు చెందిన వందన స్కూటీపై మాందాపూర్ వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓమ్ని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.