PDPL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్లో రామగుండం విద్యార్థులు సత్తా చాటారు. రామగుండం జపాన్ షిటోరియా కరాటే స్కూల్కు చెందిన ముక్తిశ్రీ 47 కేజీల విభాగంలో వెండి పతకం సాధించగా, 54 కేజీల విభాగంలో సహస్ర కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ కరాటే శ్రీనివాస్, సురేశ్,శ్రీనివాస్, శోభారాణి విజేతలను అభినందించారు.