PDPL: దసరా పండగ సందర్భంగా ప్రయాణికులకు TGSRTC లక్కీ డ్రా పథకాన్ని ప్రకటించింది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు డీలక్స్, సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్నిరకాల AC బస్సుల్లో ప్రయాణించేవారు దీనికి అర్హులు. టికెట్ వెనక పేరు, చిరునామా రాసి బస్టాండ్లోని బాక్స్ల్లో వేయాలి. మొదటి బహుమతిగా రూ. 25వేలు, 2nd ప్రైజ్ రూ. 15వేలు, ఇస్తామన్నారు.
SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో అటుకుల బతుకమ్మ సంబరాలు గురువారం నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. మహిళా ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాట పాడుతూ ఆడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జడ్పీ సీఈవో స్వప్న డీపీవో సాయి బాబా పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన సౌమ్య గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణులై డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తల్లిదండ్రులు దాసరి గిరివర్ధన్, సులోచన రాణిలకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుకు ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు.
PDPL: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారికి భక్తులు గురువారం విశేష పూజలు నిర్వహించారు. రామగుండం, గోదావరిఖని పరిసర ప్రాంతాలలో కొలువైన దుర్గాదేవి అమ్మవార్ల సన్నిధిలో మాల ధారణ భక్తులు భక్తి పారవశ్యంతో పూజలు చేశారు. దీంతో కోల్ బెల్టు పారిశ్రామిక ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని Y జంక్షన్ వద్ద కుడా నిధులతో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటుచేసారు. ఈ లైట్లను రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో హనుమకొండ సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలోని వినాయక నగర్, రైల్వే కాలనీ రోడ్డు ప్రాంతాల్లో గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కమిషనర్ను కలిసి వీధిలైట్ల సమస్యను తెలియజేశారు. రాత్రి వేళల్లో వీధిలైట్లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు స్పందించిన కమిషనర్ వీధిలైట్ల పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
JGL: ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ వీఆర్కే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, ఉపాధ్యాయులు “ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర” అనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పాత బస్స్టాండ్ నుంచి కొత్త బస్స్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీనీ ప్రారంభించారు.
NLG: మునుగోడులో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని BRS మండల అధ్యక్షుడు మందుల సత్యం డిమాండ్ చేశారు. గురువారం BRS నాయకుల ఆధ్వర్యంలో ఎస్సై రవికి వినతి పత్రం అందజేశారు. ఈ చర్య మూర్ఖత్వం అని విమర్శించిన ఆయన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.
KMR: ఆర్టీసీ డిపో మేనేజర్గా నూతనంగా నియమితులైన దినేష్ గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన డీఎంకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సులను ఖచ్చితమైన సమయ పాలనతో, ప్రణాళికాబద్ధంగా నడపాలన్నారు. ప్రయాణికులను నిర్ణీత సమయానికి వారి గమ్య స్థానాలకు చేర్చడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
HYD: నగరంలో హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది “అడ్వాంటేజ్ 60” అనేది నినాదం. నవృద్ధులు కుటుంబానికి, సమాజానికి భారం కాకుండా, ఇంకా శక్తివంతంగా ఉన్నారన్నారు. ముఖ్య అతిథి గౌరీ పుత్రిక, స్వతంత్ర సమరయోధురాలు, గాంధీతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆమె చేసిన స్వతంత్ర పోరాట సేవలను స్మరించారు.
ADB: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మాజీమంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈనెల 26న నిర్వహించే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రజక సంఘం సభ్యులు మాజీ మంత్రి జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. గత BRS ప్రభుత్వ హాయంలోనే చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
BHPL: మండలం గొర్లవీడు గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైశ్య కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరుగుతున్నాయి. గురువారమైన నాల్గవ రోజు కాత్యాయని అవతారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. కమిటీ సభ్యులు రోజుకొక అవతారంలో అమ్మవారిని అలంకరించి, ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.
BDK: భద్రాచలం పట్టణంలోని సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ గ్రంథాలయాన్ని తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వరరావుతో కలిసి గురువారం సందర్శించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఏకాగ్రత, క్రమశిక్షణతో చదివితే విజయం సొంతం చేసుకోవచ్చని సూచించారు. పోటీ పరీక్షలు పూర్తయ్యే వరకు క్రీడలు, సినిమా వినోదాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు వివరించారు.
PDPL: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులో 50% రాయితీ కల్పిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. TUWJ (IJU) ప్రతినిధులు కలెక్టరేట్లో కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, DEOమాధవికి కృతజ్ఞతలు తెలిపారు.