KMR: దోమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మొదటి సంవత్సర ఇంగ్లీష్-I (సెట్–C) పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 140 మంది విద్యార్థులకు 136 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 116 మంది విద్యార్థులకు 115 మంది, వొకేషనల్ విభాగంలో 24 మందికి గానూ 21 మంది పరీక్ష రాశారు. నలుగురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు.