KMR: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 9,572 మంది విద్యార్థులకు గాను 9,258 మంది హాజరయ్యారని, 314 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు.