WNP: పట్టణంలోని 14వ వార్డు బ్రహ్మంగారి వీధిలో తాగునీటి పైప్లాన్ లీకేజీ కారణంగా తవ్వారు. సుమారు నెల రోజులు కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గుంతలో తాగునీటి పైప్లాన్ సన్నగా లీకై నీరు కలుషితం అవుతున్నదని వెంటనే అధికారులు స్పందించి పైప్లాన్ లీకేజీ కాకుండా సరిచేసి గుంతను పూడ్చాలని సీపీఎం వనపర్తి పట్టణ కార్యదర్శి పరమేశ్వర డిమాండ్ చేశారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
JGL: గ్రామ పంచాయతీలో వివిధ రకాల పన్నుల వాసులలో వేగం పెంచి 100% పన్నుల వసూలకు కృషి చేయాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. పెగడపల్లి మండలంలోని నరసింహునిపేట గ్రామపంచాయతీని సందర్శించి పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ పలు రికార్డులను తనిఖీ చేశారు. నేషనల్ అవార్డుకు నామినేటెడ్ అయినందున గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరచాలని తెలిపారు.
MBNR: మహమ్మదాబాద్ మండలంలో ఐసీడీఎస్ మహబూబ్నగర్ విభాగం ఆధ్వర్యంలో ఆడపిల్లల సంరక్షణపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, చట్టాలపై తల్లిదండ్రులకు వివరించారు. బాల్య వివాహాల నివారణలో తల్లిదండ్రుల పాత్రను తెలిపారు. పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతను గోడపత్రాల ద్వారా వివరించారు.
KMM: రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సవరణలు వ్యతిరేకిస్తూ సోమవారం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైనదికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.
PDPL: ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డికి ప్రొఫెసర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన బోధన, పరిశోధన రంగాల్లో సేవలు అందిస్తున్నారు.
JN: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మైలారం గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం, CC రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
హైదరాబాద్ ప్రేక్షకులకు సరికొత్త దృశ్యకావ్య అనుభూతిని అందించేందుకు కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ సిద్ధమైంది. నగరంలోనే మొదటి డాల్బీ సినిమా (Dolby Cinema) థియేటర్ను ఇక్కడ అధికారికంగా ప్రారంభించనున్నారు. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ప్రీమియర్ షోలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
KMM: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మధిరలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఛైర్పర్సన్ సామినేని సుజాత పర్యవేక్షణలో 1, 4, 8, 12, 22వ వార్డుల్లో కౌన్సిలర్లు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శివకృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
BDK: మణుగూరు మండలం రైల్వే స్టేషన్ సమీపంలోని న్యూ పద్మగూడెం గ్రామానికి చెందిన పద్దం ప్రసాద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్దం ప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
WGL: ఓరుగల్లులో కుర్చీ వేసుకుని అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని, ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విమర్శించారు. వరంగల్ కాంగ్రెస్ ఆఫీసులో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనేక అభివృద్ధి పనులను చేపట్టి ఓరుగల్లును సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తండా జీపీ పరిధి లోంక తాండలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ వినోద్ రాథోడ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారు నేనావత్ లక్కుబాయి సంతోష్ సొంత స్థలంలో పునాదులతో ఎందుకు కొలతల ముగ్గు వేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు సర్పంచ్ చెప్పారు. ఇందులో సెక్రెటరీ అనిల్ ఉన్నారు.
NRML: పట్టణ ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు పట్టణంలో కొత్తగా టౌన్ ఔట్పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఇవాళ తెలిపారు. పాత భరోసా కేంద్రం వద్ద ఈ ఔట్పోస్ట్ను ప్రారంభించామని, కేసులు, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
JN: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో సోమవారం పర్యటించి మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రామాయంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ప్రాంగణంలో సోమవారం అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు ప్రమాదాల పట్ల అప్రమత్తతపై పలు సూచనలు చేశారు.