• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అపరిశుభ్రంగా వంటగది.. ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది అపరిశుభ్రంగా ఉండటం గమనించి కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చూపిన డిప్యూటీ వార్డెన్, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్‌లను సస్పెండ్ చేయమని, ఇతర అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయమని సంబంధించిన అధికారులను ఆదేశించారు.

March 14, 2026 / 05:35 PM IST

ముగిసిన సర్పంచుల మొదటి దశ శిక్షణ కార్యక్రమం

SRPT: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన సర్పంచుల మొదటి దశ శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండలంలోని సర్పంచులు పాల్గొని చక్కగా క్లాసులు విని ఎంతగానో నేర్చుకున్నామని పేర్కొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి శిక్షణా సర్టిఫికెట్లు అందుకున్నారు.

March 14, 2026 / 05:33 PM IST

ఎస్‌యూ పరిధిలో ఈనెల 23 నుంచి LLM పరీక్షలు

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్ఎం (పీజీ) మూడో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. సురేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

March 14, 2026 / 05:33 PM IST

మంత్రిని కలిసిన శారదాపీఠం ఉత్తరాధికారి

RR: విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంత్రి శ్రీధర్ బాబును కలిసి కోకాపేట పీఠంలో జరిగే ఉగాది ఆస్థానానికి ఆహ్వానించారు. శారదాపీఠం సమస్యలను తక్షణమే పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. మంత్రికి అమ్మవారి ప్రసాదాన్ని అందించి, ఆశీస్సులు అందజేశారు.

March 14, 2026 / 05:33 PM IST

అరుణోదయ జిల్లా కమిటీ ఎన్నిక

BDK: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నూతన కమిటీని శనివారం ఇల్లందు మండలం ధర్మపురంలో జరిగిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా బొగ్గారపు వెంకన్న, ఉపాధ్యక్షులుగా మెంతిని కొండలరావు, ప్రధాన కార్యదర్శిగా ఎనగంటి చిరంజీవి, సహాయ కార్యదర్శిగా జోగ కాంతారావు, కోశాధికారిగా నరసింహారావులతో పాటు మరో ఏడుగురు సభ్యుల్ని ఎన్నుకున్నట్లు వెల్లడించారు.

March 14, 2026 / 05:32 PM IST

నిరుపేద కుటుంబాలకు తోపా పంపిణీ

PDPL: గోదావరిఖని పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు BRS పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి ఆధ్వర్యంలో తోఫా పంపిణీ చేశారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 500 మందికి రంజాన్ పర్వదినం సందర్భంగా సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

March 14, 2026 / 05:31 PM IST

ఒత్తిడి లేకుండా పదో తరగతి పరీక్షలు

VKB: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా విద్యాధికారి రేణుక దేవి సూచించారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 69 కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆమె తెలిపారు.

March 14, 2026 / 05:30 PM IST

వంటగ్యాస్ పంపిణీలో జాప్యం జరిగితే కఠిన చర్యలు

ADB: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కలెక్టర్ రాజర్షి షా శనివారం సమీక్ష నిర్వహించారు. వినియోగదారులు బుక్ చేసిన 3 నుండి 4 రోజుల్లోనే సిలిండర్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, మరియు డొమెస్టిక్ సిలిండర్ల దారి మళ్లింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

March 14, 2026 / 05:30 PM IST

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్

MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ మమత శ్రీనివాస్ పట్టణంలోని పలు డివిజన్లలో అధికారుల బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను ఆమె స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

March 14, 2026 / 05:30 PM IST

బాధితురాలిని పరామర్శించిన చల్మెడ

JGL: మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తోపారపు కమల ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ, కరీంనగర్‌లోని చల్మెడ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆమెను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

March 14, 2026 / 05:29 PM IST

అరగంటలో ఐదుగురిని కరిచిన కుక్క

SRCL: జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. అరగంటలో పిచ్చికుక్క కరిచిన ఘటన తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్‌లో  శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుసాపూర్‌లో పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఇద్దరు ఐదు సంవత్సరాలలోపు పిల్లలు, ఇద్దరు యువకులు, ఓ మహిళను కరిచిందని స్థానికులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

March 14, 2026 / 05:24 PM IST

‘ఇక్రిశాట్ వద్ద MMTS స్టేషన్ ఏర్పాటు చేయాలి’

SRD: నాలుగు జిల్లాల ప్రజలకు అసౌకర్యంగా ఉన్న BHEL (LIG) MMTS రైల్వే స్టేషన్‌ను NH-65 సమీపంలోని ఇక్రిశాట్ (ఫెన్సింగ్) ప్రాంతంలో ఏర్పాటు చేయాలని జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఇరిగజ్జ మురళి కృష్ణని ఇక్రిశాట్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బిక్షపతి కోరారు. ఇవాళ HITTV ప్రతినిధితో వారు మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి లింగంపల్లి నుంచి పటాన్ చెరువు వరకు MMTS రైలును పొడిగించుకున్నారని తెలిపారు.

March 14, 2026 / 05:23 PM IST

‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో పాల్గొన్న అదనపు కలెక్టర్

NRML: శనివారం ఖానాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డులలో పర్యటించి, చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజలంతా తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు.

March 14, 2026 / 05:21 PM IST

వరంగల్‌లో యువతకు డ్రగ్స్‌పై అవగాహన

WGL:యువకులు డ్రగ్స్ మత్తులో పడకుండా భవిష్యత్తును కాపాడుకోవాలని WGL పోలీస్ కమిషనరేట్ సూచించింది. కమిషనరేట్ అధికార ఫేస్‌బుక్ అకౌంట్‌లో “Your Future Matters..Stay Drug-Free.. Be Strong..Be Smart. Say No to Drugs..One Decision Can Save Your Life” అనే పోస్టర్ రూపొందించి అవగాహన కల్పిస్తోంది. డ్రగ్స్ వినియోగం, విక్రయం గమనిస్తే 1908కు సమాచారం ఇవ్వాలన్నారు.

March 14, 2026 / 05:20 PM IST

‘BRS నాయకుల అర్థనగ్న ప్రదర్శన’

ADB: రైతులకు రైతుబంధు అందించాలని కోరుతూ జైనథ్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిర్వహిస్తూ నాయకులు అర్థనగ్న ప్రదర్శనతో రైతుల నుంచి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. పెట్టుబడికి సరిపోను పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారన్నారు. రైతు భరోసాను వారి ఖాతాలో జమ చేయాలని నాయకుడు పిడుగు స్వామి డిమాండ్ చేశారు.

March 14, 2026 / 05:15 PM IST