KMM: ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్-స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా ఎంపీని లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్సభ కాలానికి సంబంధించి భారత్-స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు.
JN: ఉప్పుగల్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఉప్పుగల్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 30ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.
HNK: కాకతీయ యూనివర్సిటీలో శనివారం పూర్వ హిందూ వాహిని రాష్ట్ర కార్యదర్శి, గోపా జిల్లా సహాయ కార్యదర్శి మార్క సునీల్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాటను విడుదల చేశారు. కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహుజన హిందూ వికాస్ పరిషత్ సభ్యులు రఘురాం నాయక్, అనురామ్ చౌదరి ఉన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం తీవ్ర పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెలాఖరులోగా పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలనే ఆదేశాలు ఒకవైపు ఉండగా, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు మరోవైపు భారంగా మారింది. పని భారం పెరిగి పన్నుల వసూళ్లు చేయడం కష్టమవుతోందని కార్యదర్శులు వాపోతున్నారు.
VKB: దౌల్తాబాద్ మండల నూతన ఎస్సైగా వేణు కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్సై బంగారు రాజు వికారాబాద్ వీఆర్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నూతన ఎస్సైకి సిబ్బంది స్వాగతం పలికారు.
VKB: దౌల్తాబాద్ మండల నూతన ఎస్సైగా వేణు కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్సై బంగారు రాజు వికారాబాద్ వీఆర్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నూతన ఎస్సైకి సిబ్బంది స్వాగతం పలికారు.
BDK: టేకులపల్లి మండలం ముత్యాలంపాడు X రోడ్డు నందు సీసీ రోడ్డుకు శనివారం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రజలను విస్మరించిందని కానీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి చేసి మేలు చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ పూలబంతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
MNCL: చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా తీర్పునిచ్చారు. క్యాతన్ పల్లికి చెందిన అశోక్ కుమార్ లడ్డా వద్ద నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో శిక్ష విధించారు.
NZB: యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వర్ని ఎస్సై వంశీ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శనివారం మోస్రా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, కార్యదర్శితో ఆయన సమావేశమయ్యారు. మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా కఠినంగా శిక్ష తప్పదని సూచించారు.
WNP: రేవల్లి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 193 మంది విద్యార్థులకు (132 బాలురు, 61 మంది బాలికలు) గాను అందరూ హాజరై పరీక్ష రాయడం విశేషం. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి లేకుండా తనిఖీలు చేసి విద్యార్థులను పరీక్షకు అనుమతించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
NLG: చింతపల్లిలో శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని అన్నారు. ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఆకాక్షించారు.
NLG: చింతపల్లిలో శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని అన్నారు. ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఆకాక్షించారు.
NZB: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉపాధి హామీ పథకం (2025-26) వార్షిక ప్రణాళికలో భాగంగా శ్రీరాంపూర్, నాగపూర్, దేవాక్కపేట్ గ్రామాల్లో పలు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.
SRCL వేములవాడ లో తెలంగాణ రైతాంగ సాయుధపోరాట అమరులకు సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత కడారి రాములు మాట్లాడుతూ.. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, నిజాం నిరంకుశ పాలన వల్ల ఈ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి సీపీఐ ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయినొద్దీన్, రావి నారాయణరెడ్డి పిలుపుతో ప్రజలు పోరాటంలో చేరారన్నారు
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థుల పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట పరీక్ష కేంద్రం సిబ్బంది ఉన్నారు.