• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన సుజాత ఆశన్న

ADB: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆశన్న శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు.

March 14, 2026 / 02:00 PM IST

పకృతి వనాన్ని సందర్శించిన మున్సిపల్ ఛైర్మన్

WGL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ పకృతి వనాన్ని నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రామానంద్ సందర్శించారు. ప్రకృతి వనాల ద్వారా పట్టణంలోని కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు.  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాల్సిందిగా ప్రజలను కోరారు.

March 14, 2026 / 02:00 PM IST

ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం హాజరు

KMR: జిల్లాలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ పరీక్షలకు 91.37 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 1,738 మంది విద్యార్థులకు గాను 1,588 మంది హాజరు కాగా, 150 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా, నిబంధనల ప్రకారం జరిగాయని ఆయన వివరించారు.

March 14, 2026 / 01:56 PM IST

RWS అధికారులతో MLA సమీక్షా సమావేశం

KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం RWS అధికారులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

March 14, 2026 / 01:52 PM IST

పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన ఎమ్మెల్యే

KMM: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో కార్యచరణలో భాగంగా శనివారం కల్లూరు మున్సిపాలిటీ నాలుగో వార్డులో మున్సిపల్ ఛైర్మన్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. ఈ పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి పర్యవేక్షించారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించారు.

March 14, 2026 / 01:49 PM IST

పీహెచ్‌సీని తనఖీ చేసిన డీఎంహెచ్‌వో

NZB: సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డా .రాజశ్రీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పాత భవనాన్ని, రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ రాజ్కుమార్ పాల్గొన్నారు.

March 14, 2026 / 01:45 PM IST

పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: WGL CP

WGL: ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. CP మాట్లాడుతూ.. వేసవి తాపం పెరుగుతున్నందున పిల్లలు ఈత కోసం చెరువులు, కుంటలకు వెళ్లే అవకాశం ఉందని, అటువంటి సందర్భాల్లో వారి పై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.

March 14, 2026 / 01:44 PM IST

MP కావ్య వినతికి కేంద్రం స్పందన

HNK: తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయించాలని వరంగల్ MP కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు MPకి లేఖ ద్వారా “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పంటల రవాణా సులభతరం కావడానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని MP అన్నారు.

March 14, 2026 / 01:44 PM IST

మొదటిరోజు పరీక్షకు ఒకరు గైర్హాజరు

NLG: చిట్యాల పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షకు 415 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 417 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా.. ఒకరు గైర్హాజరుకాగా, మరొకరికి తెలుగు పరీక్ష నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించారు.

March 14, 2026 / 01:43 PM IST

మొదటి రోజు పరీక్షకు ఒకరు గైర్హాజరు

NLG: చిట్యాల పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షకు 415 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 417 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా.. ఒకరు గైర్హాజరుకాగా, మరొకరికి తెలుగు పరీక్ష నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించారు.

March 14, 2026 / 01:43 PM IST

నూతన SIను సన్మానించిన.. సర్పంచ్

BHPL: రేగొండ మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుధాకర్ను శనివారం దుంపిల్లపల్లి గ్రామ సర్పంచ్ అజ్మీర రాజేందర్, వార్డు మెంబర్లు రవి, బిక్షపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు అజ్మీర్, ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి షాబిర్ తదితరులు ఉన్నారు.

March 14, 2026 / 01:42 PM IST

‘పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి’

వనపర్తి పట్టణంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి తెలిపారు. శనివారం 33వ వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన బోరును కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తామని హామీ ఇచ్చారు.

March 14, 2026 / 01:40 PM IST

అడవిలో నిప్పు.. పర్యావరణానికి ముప్పు: సర్పంచ్

MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఇవాళ అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ వంశావతి-రమేష్ హాజరై, మాట్లాడుతూ.. “అడవిలో నిప్పు.. పర్యావరణానికి ముప్పు.. అడవి సంరక్షణ సమస్త జీవకోటి పరిరక్షణ” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, వార్డు మెంబర్లు ఉన్నారు.

March 14, 2026 / 01:38 PM IST

పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన MRO

MHBD: తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని శనివారం MRO శ్రీనివాస్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా MRO పరీక్షల నిర్వహణ తీరు, ఇన్విజిలేషన్ విధానం, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు ఏ రకమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చూడాలని తాహసీల్దార్ అధికారులకు సూచించారు.

March 14, 2026 / 01:38 PM IST

ఎంపీ రామ సహాయానికి కీలక బాధ్యత

KMM: ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్-స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ సభ్యుడిగా ఎంపీని లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్‌సభ కాలానికి సంబంధించి భారత్-స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

March 14, 2026 / 01:34 PM IST