WNP: రేవల్లి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 193 మంది విద్యార్థులకు (132 బాలురు, 61 మంది బాలికలు) గాను అందరూ హాజరై పరీక్ష రాయడం విశేషం. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి లేకుండా తనిఖీలు చేసి విద్యార్థులను పరీక్షకు అనుమతించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.