NRML: శనివారం ఖానాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డులలో పర్యటించి, చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజలంతా తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు.