ADB: హార్టికల్చర్ శాఖ ద్వారా రూ. 500 విలువచేసే కూరగాయల విత్తనాల కిట్లను ఈరోజు బోథ్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో 100% సబ్సిడీతో రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. కూరగాయలు పండించే రైతులు మాత్రమే ఈ కూరగాయల కిట్లకు అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్, ఏఈఓ ఆడెపు కృష్ణ పలువురు రైతులు పాల్గొన్నారు.
KMM: మాజీ MP నామా నాగేశ్వరరావు పుట్టిన రోజు వేడుక నేలకొండపల్లి మండల BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ప్రజల మనిషి నామ నాగేశ్వరరావు అని కొనియాడారు.
NZB: కాగజ్ నగర్ టు బోధన్ వెళ్లే మెమూ రైలు పేద, మధ్య తరగతి ప్యాసింజర్లకు చవకగా మారింది. రూ.10తో 45km జర్నీ చేసే అవకాశం ఉంది. రామగుండం-సిర్పూర్ టౌన్ మధ్య 45km దూరానికి కేవలం రూ.10 టికెట్ ఛార్జి ఉంది. ఇలా RGM-బోధన్ మధ్య వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే ఈ ట్రైన్ టికెట్లు సింపుల్గా రూ.20, రూ.25, రూ.30, రూ.40గా ఉంది. చాలామందికి ఈ ట్రైన్ రాకపోకల గురించి అవగాహన లేదు.
NLG: చింతపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని తెలిపారు.
WNP: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం సెలవు దినమైనా మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పన్నులు సేకరిస్తున్నారు. ఈ నెల చివరి నాటికి ప్రజలందరూ బాకీలు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది కోరుతున్నారు.
HYD: చార్మినార్ నైట్ బజార్కు వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. ఈ భారీ రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. షాపింగ్కు వచ్చే వారు తమ నగదు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువుల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని మైకుల ద్వారా పోలీసులు నిరంతరం ప్రకటనలు చేస్తున్నారు.
WGL: పర్వతగిరి మండలం దౌలత్నగర్ బాజీ తండాకు చెందిన మాలోత్ పరమేష్ క్యాన్సర్తో బాధపడుతున్న నేపథ్యంలో చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీ కాపీని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. ఆదివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ అందించి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
NLG: దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో ‘ప్రజాప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో వారి సేవలను గుర్తించి వారికి సబ్బులు, గ్లౌజులు, టోపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి మాసారం అంబేద్కర్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
BHPL: భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామంలో సుంకరి సంతోష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదలకు గౌరవప్రద నివాసం కల్పించడమే ఇందిరమ్మ పథకం లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
BHNG: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనరసయ్య హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, పాల్గొన్నారు.
BDK: మణుగూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ వర్కర్లకు కమిషనర్ శ్యామ్ పరిశుభ్రత కిట్లను ఇవాళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి చెందిన 66 మంది మున్సిపల్ కార్మికులకు ఒక సంవత్సరానికి అవసరమైన పరిశుభ్రత వస్తువులను అందజేశారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీలో వరుస బ్యాటరీల చోరీలు కలకలం రేపుతున్నాయి. చిట్యాల–భువనగిరి రోడ్డులో పార్క్ చేసిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ బ్యాటరీతో పాటు, మరో ట్రాక్టర్ బ్యాటరీని శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ 13వ వార్డు (కేసారం)లో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలియజేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ దేవరసమత వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
MLG: ఢిల్లీలో జరుగబోయే BJP కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలన వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొనేందుకు MLG జిల్లా నుండి కాంగ్రెస్ యూత్ నేతలు బయలుదేరారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట(M)యూత్ అధ్యక్షులు క్రాంతి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఢిల్లీకి బయలుదేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ అధ్యక్షుడు వెంకటేష్, తాడ్వాయి అధ్యక్షుడు సతీష్ ఉన్నారు.
MHBD: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18న నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రజలు ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.