NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉత్సాహంగా సాగుతుంది. ఆదివారం సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి, నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధిలో కార్మికుల సేవలు అమూల్యమని ఆయన కొనియాడారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.
ADB: గ్రామాన్ని శుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులను ప్రజలు గౌరవించాలని ఎంపీడీవో సూపరింటెండెంట్ గంగాసింగ్ రాథోడ్ అన్నారు. ఆదివారం నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి బానోత్ కావేరి, సిబ్బందితో కలిసి పారిశుధ్య కార్మికులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
MNCL: బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి పంచాయతీ పరిధిలో ఆదివారం NREGS పథకం కింద రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నామన్నారు.
BDK: భద్రాచలం పట్టణంలో దళిత బహుజన ఆశాజ్యోతి మాన్యవర్ కాన్షిరామ్ జయంతి వేడుకలను ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. కాన్షిరామ్ భారత రాజకీయాల్లో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికారని కొనియాడారు.
HNK: పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్, హౌస్ బూజూర్గు గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో MLA పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంబించారు. అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
KMR: 2026-27 జనగణన దశ-1 గృహ జాబితా, గృహ గణన కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులకు కలెక్టరేట్లో ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో జనగణనను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఈ శిక్షణా మార్చి 15 నుంచి 17 వరకు IDOC సమావేశ మందిరంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తహశీల్దార్లు పాల్గొన్నారు.
SDPT: హనుమతండాలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా సర్పంచ్ బాధవత్ లలిత సిబ్బందితో కలిసి వాటర్ ట్యాంకులను క్లీన్ చేయించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించి, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని వార్డ్ ఆఫీసర్లకు సూచించారు. ఈ సందర్భంగా MPW వర్కర్లకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.
MBNR: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డిని దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలని అందులో ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలన్నారు.
NGKL: లక్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి గృహప్రవేశం నిర్వహించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించి వారి స్వంత ఇంటి కలను నెరవేర్చుతుందని ఆయన పేర్కొన్నారు.
NGKL: సీఎం సహాయ నిధి పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దయ్యాల సమత-శ్రీకాంత్ ఓటమిపాలైనా తన హామీని నిలబెట్టుకొని ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల సమయంలో వార్డులోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,116 కానుకగా ఇస్తానని వారు మాట ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ సంతోష్ నగర్కు చెందిన స్వాతి వివాహానికి దంపతులిద్దరూ హాజరై రూ.10,116 నగదును పెళ్లి కానుకగా ఇచ్చారు.
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ అభిలాష అభినవ్ జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. పరీక్షల గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఆత్మస్థైర్యంతో ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు.
ASF: కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని గోవర్ హెట్టి శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో మార్చి 22 నుంచి 24 వరకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు MLC దండే విఠల్, మాజీ ZP ఛైర్మన్ గణపతితో పాటు పలువురు నేతలను నిర్వాహకులు ఆహ్వానించారు. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ మహిళలకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్ ఆదివారం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు మైనార్టీ మహిళలకు రంజాన్ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2 వార్డు కౌన్సిలర్ సురేఖ, నాయకులు షరీఫ్ ఉన్నారు.
JN: బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ జంగిటి లక్ష్మయ్యకు గుండె సంబంధిత వ్యాధి రావడంతో హైదరాబాదులో హాస్పిటల్లో చేరారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ LOC ద్వారా రూ.2, 50,000 మంజూరు చేయించారు. ఈ చెక్కును ఇవాళ లబ్ధిదారు కుటుంబానికి అందజేశారు.