NZB: సిరికొండ మండలం శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ మందిరంలో నవగ్రహాల విగ్రహాల ప్రతిష్ఠాపన కోసం దాతలు ముందుకు వచ్చారు. దువ్వూరు లక్ష్మీనారాయణ రెడ్డి, అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి రూ.70 వేల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దైవకార్యానికి ఆర్థిక సాయం అందించిన దాతల కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
KNR: చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బరిగెలపల్లిలో ముదిరాజ్ గ్రామశాఖ ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. సర్పంచ్ సన్నీల్ల కవిత కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ముదిరాజ్లు ఆలయ నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేయడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
WNP: మధుమేహం ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కంటి రెటీనా దెబ్బతిని చూపుకోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధుమేహ బాధితుల ఆరోగ్యం బాగు కోసం ‘దృష్టి’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే షుగర్, రెటినోపతి వంటి సమస్యలు వస్తున్నాయి అన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
NRML: దండేపల్లి మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ సందర్భంలో తాళ్లపేట, మ్యాదరి పేట, నర్సాపూర్ రోడ్డులోని ఈద్గాహ్ వద్ద శనివారం ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. నమాజ్ అనంతరం ముస్లింలు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. స్థానిక ప్రముఖులు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
KNR: భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సూచించారు. ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం, బండ్లు, చిన్న రథం, పెద్ద రథోత్సవం, నఖబలి వంటి ప్రధాన ఘట్టాలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
MNCL: విద్యుత్ ప్రమాదాల నివారణకు NPDCL సంస్థ LC యాప్ అందుబాటులోకి తెచ్చినట్లు మంచిర్యాల SE రాజన్న ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయి విద్యుత్తు ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా సంస్థ ప్రత్యేక యాప్ తెచ్చిందన్నారు. అత్యాధునిక, సాంకేతిక విధానంతో సిబ్బందికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇక నుంచి తప్పుడు ఫీడర్ల ఎంపిక, పంపిణీ వ్యవస్థపై అస్పష్టత సమస్యలు తలెత్తవన్నారు.
ADB: సోనాల మండలంలోని కొర్థ గ్రామానికి చెందిన వైద్యుడు అభిజిత్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ MP, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 4 వార్డు కౌన్సిలర్ పిల్లి తిరుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి చెత్త విభజనపై అవగాహన కల్పించారు.ఇంటి పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరు బయట చెత్త వేయకుండా, మున్సిపల్ బండికి తడి చెత్త పొడి చెత్త వేరుచేసి అందించాలని సూచించారు.
BHPL: కాటారం మండలంలో రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ వేడుకల్లో మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య పాల్గొని మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే పవిత్రమైన మాసమని అన్నారు.
SRD: రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు రంజాన్ పండుగ గురించి వివరించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
VKB: TGSET-2025 ఫలితాల్లో మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగంలో వికారాబాద్ జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీలో విజయం సాధించిన వారు జె. దీపిక (158 మార్కులు), విష్ణువర్ధన్ (150), వి. వనిత (146), జి. మౌనిక (144), ఎం. ప్రవీణ్ కుమార్ (140) మార్కులతో ప్రతిభావంతులుగా ప్రదర్శన కనబరిచారు. వీరిని గ్రామస్థులు అభినందించారు.
BHPL: టేకుమట్ల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారానే పక్క సమాచారం మేరకు SI సుధాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని డ్రైవర్ వినయ్పై కేసు నమోదు చేశారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.
BDK: అశ్వాపురం మండల కేంద్రంలో మద్యం సిండికేట్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం సాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారి పక్కన, దేవాలయం, ఆసుపత్రి వంటి సున్నిత ప్రాంతాల సమీపంలోనే సిండికేట్ ఆఫీస్ నడుస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి ఈ కార్యాలయాన్ని మూసివేయాలని కోరారు.
BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు పట్టణంలోని ఈద్గా వద్దకు భారీగా చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నలు, పెద్దలు ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. ఏటా ఆనవాయితీగా ఇక్కడ వేడుకలు జరుపుకుంటామని, పండుగ వేళ అందరూ ఆనందంగా గడిపామని ముస్లిం సోదరులు తెలిపారు.
KMR: బిక్కనూర్ మండల టోల్ ప్లాజా సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న డీసీఎం నుంచి నాలుగు అల్లం పేస్ట్ కాటన్లు జారిపడ్డాయి. దీనిని గమనించిన టోల్ సిబ్బంది, మరో వాహనంలో వెళ్లి లారీని వెంబడించి ఆ బాక్సులను డ్రైవర్కు భద్రంగా అందజేశారు. సిబ్బంది నిజాయితీని లారీ యజమాని అభినందించారు.