MLG: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ములుగు మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ కుతుబుద్దీన్ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొన్నారు. సామరస్యం, పరస్పర గౌరవం, ఐక్యతతో అందరూ జీవించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు, ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు.
WNP: గోపాల్పేట్ మండలంలోని తాడిపర్తి గ్రామ శివారులో ఉన్న గాయత్రి టీటీసీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం, జనుంపల్లి గ్రామానికి చెందిన నిరంజన్ వల్లీ శుక్రవారం విడుదలైన టీజీ సెట్ -2025 ఫలితాలలో ప్రతిభ చాటాడు. ఎడ్యుకేషన్ విభాగంలో లెక్చరర్ & అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత సాధించారు. దీంతో పలువురు ఆయన్ని అభినందించారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో పండుగ వాతావరణం నెలకొంది.
BDK: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని సీఐటీయూ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టిల అర్జున్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ఆర్ధిక భారం మోపి, ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచి దేశ ప్రజలపై మోయలేని ఆర్థిక భారాలు మోపుతుందన్నారు.
BHNG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ శాసన సభ విప్గా నియామకం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ గడుసు శశిదర్ రెడ్డి ఆయన్ను కలిసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. నకిరేకల్ అభివృద్ధికై అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
HNK: తెలంగాణలో 60% జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, 2026-27 బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ అన్నారు. హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా అమలు చేస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అన్నారు.
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) కల్పనదేవి మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణతోనే మానవజాతి మనుగడ సాధ్యమని, అడవుల విధ్వంసం వల్ల వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని, పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
HYD: శంషాబాద్ ఎయిర్ఫోర్ట్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వెనక్కి మళ్లింది. జగదల్పూర్ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్కు ప్రతికూల పరిస్థితులు ఉండటంతో అధికారులు విమానాన్ని తిరిగి శంషాబాద్లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలోని 92 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
SRPT: హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో ఈనెల 24న జరగబోయే సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఐదవ మహాసభలు విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నవీన్ తేజ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 24న మఠంపల్లిలో జరిగే సమాచార హక్కు రక్షణ చట్టం 5 మహాసభకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ఆర్టీఐ కార్యకర్తలు పాల్గొనాలన్నారు.
NZB: ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.754 కోట్ల కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్లో గత 14 ఏళ్లుగా నత్త నడకన కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(UGD) పనులు పూర్తవుతాయా? లేదా అని ప్రజలు భావిస్తున్నారు. 2007లో రూ.94 కోట్ల అంచనా వ్యయంతో 2008 మార్చి 24న కాంట్రాక్టర్కు పనులు అప్పగించగా ప్రస్తుతం రూ.246 కోట్లకు పెరిగింది.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్లోని ఈద్గా, మసీదుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సర్తాజ్, నాయకులు అనంతరెడ్డి పాల్గొన్నారు.
KMR: బిక్కనూరు పట్టణ తై బజార్ వేలంపాటను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు గ్రామ సచివాలయ కార్యదర్శి మహేష్ గౌడ్ శనివారం తెలిపారు. వారసంతతో పాటు రోజువారీ సంతలకు ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనేవారు రూ.10,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయంలో సంప్రదించాలని కోరారు.
NGKL: వెల్దండ మండలంలోని నగారగడ్డ తండా సర్పంచ్ శారద శనివారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తండాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
PDPL: పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని చందపల్లి ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల ఉపవాసాల అనంతరం వచ్చే ఈద్-ఉల్-ఫితర్ పండుగను కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. తెలంగాణ మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం అని, రంజాన్ ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు.
SDPT: అక్బర్ పేట భూంపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మక్కలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.