• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం: MLA

HNK: అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. KUDA కార్యాలయంలో భద్రకాళి ఆలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల నిర్మాణం కారణంగా ఇళ్లను కోల్పోతున్న భూ-నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

March 21, 2026 / 04:28 PM IST

ఎండలు భగ భగ.. భారీగా కరెంట్ డిమాండ్

HYDలో ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. HYDలో విద్యుత్ డిమాండ్ 341 మిలియన్ యూనిట్లకు మించి నమోదవుతోంది. పెరుగుతున్న లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

March 21, 2026 / 04:28 PM IST

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

NRML: విద్య రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఏఐఎస్ఎఫ్ విద్యార్థిసంఘ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ బడులపై ప్రభుత్వం ఇకనైనా శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.

March 21, 2026 / 04:28 PM IST

సంస్కృతి, సాంప్రదాయాల గొప్పవి: MLA

ADB: ఆదివాసీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని గిరిజాయి మాత ఆలయంలో శనివారం నిర్వహించిన జాతర కార్యక్రమంలో అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 21, 2026 / 04:27 PM IST

25న దమ్మపేట వారాంతపు సంత వేలం

BDK: దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వారాంతపు సంత బహిరంగ వేలం ఈ నెల 25న నిర్వహించనున్నట్లు జీపీతీ కార్యదర్శి బండి అనంత కుమార్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉదయం 10 గంటలకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ వేలానికి రూ.1,15,000 మద్దతు ధరగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

March 21, 2026 / 04:26 PM IST

‘సర్వాంగ సుందరంగా వేములవాడను తీర్చిదిద్దుతా’

SRCL: సర్వాంగ సుందరంగా వేములవాడ పట్టణాన్ని తీర్చి దిద్దుతానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి నుంచి ఆలయం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. సుమారు రూ. 46 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాల పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.

March 21, 2026 / 04:25 PM IST

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్

KNR: హుజూరాబాద్ పట్టణంలో ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ముస్లింలు భారీగా తరలివచ్చి ప్రత్యేక నమాజ్ చేశారు. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 04:25 PM IST

‘గరికపాటి పై చర్యలు తీసుకోవాలి’

MDK: పేద విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ, ప్రభుత్వ పాఠశాలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని SFI డిమాండ్ చేసింది. జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, తూప్రాన్ డివిజన్ కార్యదర్శి అంజనేయులు వేరువేరు ప్రకటన విడుదల చేశారు. ప్రవచనాల పేరుతో విద్యార్థులపై అసభ్యంగా అవమానకరంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు.

March 21, 2026 / 04:22 PM IST

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: జిల్లా న్యూ గంజ్ మార్కెట్ యార్డ్ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం ముస్లింల గొప్ప పండగ, సందర్భంగా సన్మార్గంలో నడుస్తూ.. మానవత్వం చాటాలనే సందేశాన్ని రంజాన్ ఇస్తుందన్నారు.

March 21, 2026 / 04:20 PM IST

మక్తల్‌లో ఘనంగా రంజాన్ ప్రార్థనలు

NRPT: మక్తల్‌లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది హాజరై ప్రార్థన స్థలాలు కిటకిటలాడాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉదయం ఈద్గా మైదానాలకు చేరుకుని నమాజ్ చేశారు. అనంతరం ఖురాన్ బోధనలు వినిపించారు.

March 21, 2026 / 04:17 PM IST

పాఠశాలల్లో అడ్మిషన్.. తలకు మించిన భారంగా ఫీజులు

RR: ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉప్పల్, అత్తాపూర్ ప్రాంతాల్లో నర్సరీ ఫీజులు భారీగా పెరిగాయి. కొన్ని పాఠశాలల్లో రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అదనంగా ఉండటంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

March 21, 2026 / 04:17 PM IST

ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన

KMM: చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామపంచాయతీలో శనివారం ఉపాధి హామీ పథకం కింద రూ.8 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫారసుతో మంజూరైన ఈ పనులను మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఓర్సు వీరభద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పల గోవిందరావు పాల్గొన్నారు.

March 21, 2026 / 04:13 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆదివాసి సంఘం నేతలు

MHBD: కొత్తగూడ(M)బొత్తావానిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ కోశాధికారి పుల్సం సురేందర్ ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్, గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

March 21, 2026 / 04:12 PM IST

మధ్యలో నిలిచిన పనులు.. తప్పని తిప్పలు!

MDCL: ఉప్పల్, మౌలాలి, నాచారం ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు తవ్వి మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టితో ప్రయాణం కష్టంగా మారి తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

March 21, 2026 / 04:12 PM IST

రామప్ప ఆలయాన్ని సందర్శించిన విదేశీయులు

MLG: జిల్లాలో యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం అమెరికాకు చెందిన రేటా హేంగ్, మెక్సికోకు చెందిన రోలండో అలెక్జరియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వారి చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ గైడ్ వెంకటేష్ ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

March 21, 2026 / 04:08 PM IST