NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యాన్నిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.