HYD: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్లో వైష్ణవి అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలే దీనికి కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.