MDK: నార్సింగికి చెందిన దుర్గాభవాని (22) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మనస్తాపంతో గత నెల 27న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను మెదక్, అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.
SRPT: కోదాడ పట్టణ పరిధిలోని మూడో వార్డు తమ్మరబండపాలెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త వేణుగోపాల చార్యులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవ వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు.
MLG: తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో మంగళవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దిడ్డి మోహన్ రావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్థుల సౌకర్యార్థం నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు పనులు సమయానికి పూర్తి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. వార్డు మెంబర్లు ఉన్నారు.
MNCL: జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్ (43) TVS ఎక్సెల్ బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో కిందపడి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి జైపూర్ పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. నస్పూర్ అంబులెన్స్ EMT ప్రదీప్, పైలట్ అరవింద్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు.
WGL: గీసుకొండ మండలంలోని కొమ్మాల జాతర సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గులాబీ ప్రభ బండ్లు సిద్ధం చేసినట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు గిర్నీబావి నుండి ప్రభ బండ్ల ర్యాలీ ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, హాజరు కావలసిందిగా పిలుపునిచ్చారు.
NLG: ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం టీజీ రాష్ట్ర కార్యదర్శిగా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెంకు చెందిన బండారు శంకర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ నియమించారు. SC, ST, BC మైనార్టీ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని శంకర్ తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ADB: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఊరట లభించింది. చెన్నూర్లో నిరసన చేపట్టిన కేసులోనూ కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ADB జిల్లా జైలు నుంచి ఈ నెల 4న ఉదయం ఆయన విడుదల కానున్నట్లు న్యాయవాది శ్రీకాంత్ తెలిపారు. దీంతో గత నెల 18నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న సుమన్ రేపు బయటకు రానున్నారు.
KNR: హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆదర్శ క్రీడా పాఠశాలలో రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు శ్యాంసుందర్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై కోచ్కు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హత సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.
MBNR: రాజాపూర్ గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం రాజాపూర్ మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్లో స్పీకర్ను కలిసి గ్రామ పంచాయతీల బలోపేతానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
BDK: మణుగూరు మండలం గోదావరిలో మంగళవారం స్నానానికి దిగి ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా హోలీ పండుగ సందర్భంగా మల్లెపల్లి సింగరేణి వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పద్మగూడెం గ్రామానికి చెందిన గుండి నాగేశ్వరరావు (40), పద్దం ప్రసాద్ (35) (సింగరేణి ఉద్యోగి) స్నానం చేయడానికి గోదావరి నదిలో దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: హైదరాబాద్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
BDK: హోలీ పండుగ పూట మణుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని పద్మగూడెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లాలోనీ బోధన్ పట్టణంలోని 16వ వార్డులో చిన్నారులు వినూత్నంగా హోలీ సంబరాలు జరుపుకుని అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలు ప్రత్యేకంగా ట్రాక్టర్లో నీటిని నింపి, అందులో రంగులు కలిపి వీధుల గుండా తిరుగుతూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వారి ఈ వినూత్న ఆలోచన స్థానికులను ఆకర్షించడంతో పాటు పండుగకు ప్రత్యేక వాతావరణాన్ని తీసుకొచ్చింది.
BDK: జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ప్రవేశాలకు ఎంపిక జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుంచి 18 వరకు, అటు తుది ఎంపికలు భద్రాద్రి, ఖమ్మం జిల్లా స్థాయిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.