NZB: నందిపేట్ మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ రావుపై జిల్లా సీపీకి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై దొంగనోట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.
SRD: సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో రబ్బి సాగు కోతలు ముగిసినా, ఐకేపీ (IKP) కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనగ కుప్పలు సిద్ధంగా ఉన్నప్పటికీ విక్రయాలు జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
GDWL: కేటీదొడ్డి మండలం ఇరికిచెడు సబ్స్టేషన్కు నూతన ఆపరేటర్గా బాధ్యతలు స్వీకరించిన పీ.వెంకట్ రెడ్డిని గ్రామ ప్రజలు మంగళవారం సన్మానించి, స్వాగతం పలికారు. నూతన ఆపరేటర్ గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ లక్ష్మయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
SRPT: హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ జర్నలిస్టులు హోలీ వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. నిరంతరం వార్తా సేకరణలో నిమగ్నమయ్యే జర్నలిస్టులు, వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి రంగుల పండుగలో మునిగితేలారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ సోదరభావాన్ని చాటారు.
SDPT: తెలంగాణలో జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఇటీవల రాహుల్ బొజ్జా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పూల మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ బొజ్జాకు మంత్రి అభినందనలు తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ తల్లి 12వ వార్షికోత్సవ వేడుకలకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్లో ఆలయ ధర్మకర్త, కాంగ్రెస్ నాయకులు ర్యాకల కృష్ణ గౌడ్, బైరి ప్రశాంత్ గౌడ్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు, ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరమైన చర్యలకు గురవుతుందని జిల్లా ఎస్పీ డీ. జానకి తెలిపారు. నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అసత్య ప్రచారం గమనించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
NGKL: కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపడుతున్న పాటు కాలువల పూడికతీత పనులను మంగళవారం ఏపీవో నాగరాజు పరిశీలించారు. గ్రామంలోని పని ప్రదేశానికి సందర్శించి కూలీలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కేవైసీ ఆధార్ ఫోటో క్యాప్చర్ విధానాన్ని పరిశీలించి కూలీలకు అవగాహన కల్పించారు.
MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను 14వ వార్డు కౌన్సిలర్ ఆసాది మధు ఆధ్వర్యంలో మంగళవారం సత్కరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కారించమన్నారు. ఈ సందర్భంగా ఆసాది మధు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న వారిని అభినందించారు.
NRML: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరారు. ప్రజలు పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు.
WGL: 20వ డివిజన్ కాశిబుగ్గ శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ రామా సత్య నారాయణస్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హోలీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవోపేతంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు వంగరి రవి మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని MLR ఆటో యూనిట్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ షెడ్డు బయట అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడున్న పాత వస్తువులతో పాటు, కొన్ని ఆటోలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కంపెనీ కార్మికులు గుర్తించి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందజేయడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: పెగడపల్లి మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు రూ.12 లక్షల ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయని ఎంపీవో శశికుమార్ రెడ్డి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా బకాయిలన్నీ చెల్లించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
SRPT: నడిగూడెం మండలం ఫారెస్ట్ పరిధిలో గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నడిగూడెం, మునగాల మండలాలకు చెందిన భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
VKB: చంద్రగ్రహణం నేపథ్యంలో ధారూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో నిత్య పూజలు నిలిపివేయడం ఆనవాయితీ అని, అందుకే ముందస్తుగా ద్వారాలు మూసివేసినట్లు ఆలయ పూజారి కుమారస్వామి తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.