మహబూబ్ నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు, ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరమైన చర్యలకు గురవుతుందని జిల్లా ఎస్పీ డీ. జానకి తెలిపారు. నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అసత్య ప్రచారం గమనించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.