VKB: చంద్రగ్రహణం నేపథ్యంలో ధారూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో నిత్య పూజలు నిలిపివేయడం ఆనవాయితీ అని, అందుకే ముందస్తుగా ద్వారాలు మూసివేసినట్లు ఆలయ పూజారి కుమారస్వామి తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.