గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
భాగ్యనగరంలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ వార్త సంచలనంగా మారింది. అయితే ఈ బాలుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా జీహెచ్ఎంసీ ప్రకటించింది. వీటిలో కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2 లక్షలు, మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఇస్తామని వెల్లడించింది.
సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.
kodandaram:తెలంగాణ వాదం మరింత బలంగా వినిపించింది మిలియన్ మార్చ్ (million march). మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10వ తేదీన తెలంగాణ బచావో (telangana bachao) సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొపెసర్ కోదండరామ్ (kodandaram) తెలిపారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను (wall poster) ఆయన ఆవిష్కరించారు.
సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
RGV : ఇటీవల ఓ నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేయగా... ఆ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
governer on preethi died:మెడికో ప్రీతి (preethi) మృతిపై తెలంగాణ గవర్నర్ (governer) తమిళి సై సౌందరరాజన్ (tamili sai) స్పందించారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారని అడిగారు. నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాకతీయ మెడికల్ యూనివర్సిటీ (kmcr) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ అబ్బాయిని క్షమాపణ చెప్పాలని అతని చేయి పట్టుని కోరాడు. ఓ యువతిని రోడ్డుపై అతను కొట్టడాన్ని గమనించిన హీరో ఆపి మరి ఎందుకు కొట్టావని నిలదీశాడు. ఆ క్రమంలో ఆ యువతికి సారీ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
EAMCET : తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
హైకోర్టులో న్యాయవాదినని రెచ్చిపోయాడు. తనకు నెలకు రూ.75 వేలు సంపాదిస్తానని చెప్పాడు. మీరు సంపాదిస్తారా అంతా? అని ప్రశ్నించాడు. మీరు అంత సంపాదిస్తున్నారా? మీకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ అడిగాడు.
record rate in teja mirchi:మిర్చి (mirchi) ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈసారి క్రాప్ (crop) కూడా ఎక్కువే వచ్చింది. ఖమ్మం (kammam) మిర్చి మార్కెట్లో తేజ మిర్చి (teja mirchi) ధరకు రికార్డ్ ధర పలికింది. క్వింటా (quinta) మిర్చికి రూ.21,625 ధర వచ్చింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర (rate) అని అక్కడి రైతులు చెబుతున్నారు.
Telangana News : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ తో మొదలైన వైరం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసీఆర్ పర్యటనలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ , ఫ్లెక్సీలను ఇంకా తీయలేదని కాంగ్రెస్ శ్రేణులు నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
వరుసగా దాడులు చేస్తుండడంతో కలకలం రేపుతున్నది. అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీతో పాటు ఈడీ (Enforcement Directorate) దాడులు కూడా తరచూ జరుగుతున్నాయి.
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మెడికో ప్రీతి(Medico Preeti) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజిఎం(MGM) ఆస్పత్రిలో మెడిసిన్ చేస్తున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్(NIMS)లో ఆమెకు వైద్య చికిత్స అందించినా కోలుకోలేకపోయింది. తాజాగా ప్రీతి కేసు(Preeti Case)లో తెరపైకి మరో కొత్త కారణం బయటికొచ్చింది.