MDK: రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారి నీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.
KNR: తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను తొలిసారిగా చిన్న జీయర్ స్వామి సందర్శించారు. నుస్తులాపూర్ క్రాసింగ్ వద్ద భక్తులు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించగా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ADB: బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలోని శబరిమాత ఆశ్రమ భక్తుల కోరిక మేరకు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే స్పందించి, షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ నిర్మాణ పనులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, గంగమల్లు, తదితరులు పాల్గొన్నారు.
BHPL: చిట్యాల(M) బౌసింగ్ పల్లికి చెందిన అక్క-తమ్ముడు చిందం సౌమ్య, గౌతమ్ జాతీయ స్థాయి పరీక్షల్లో అసాధారణ ప్రతిభ చూపారు. దెహ్రాడూన్ RIMC ఫలితాల్లో సౌమ్య TG నుంచి అర్హత సాధించిన ఏకైక బాలికగా నిలిచింది. ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో గౌతమ్ జిల్లాలో ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. జిల్లా వ్యాప్తంగా వీరి విజయాన్ని ప్రశంసిస్తున్నారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియోపతి వైద్యరాలు పద్మశ్రీ మత ప్రచారం నిర్వహిస్తున్నారన్న విషయంపై విచారణ చేపడుతున్నామని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి నివేదిక అనంతరం వరంగల్లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆయుష్) అధికారులకు నివేదిక పంపుతామన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
NLG: మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 5 మండలాలకు చెందిన 98 మంది రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, కల్టివేటర్లు వంటి పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
KMM: నివారణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్లో నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డితో కలసి డీజీపీ ప్రారంభించారు. పోలీసు కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈ కాంప్లెక్స్ నిర్మించామన్నారు.
WGL: గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో మరో రెండు రోజుల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభం కానుంది. అయితే ప్రతి ఏడాది ప్రతి ఏడాది జాతర సమయంలో స్థానికంగా రాజకీయ అంతర్గత విభేదాలు, వర్గ పోరాటాలు చర్చనీయాంశమవుతుండగా ఈసారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
MNCL: సామాజిక సేవా రంగంలో వెలమ సంక్షేమ మండలి ముందుంటుందని MLA ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో MLA పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేశారు. మాజీ DCC అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మార్చి 3న ఉదయం 8 గంటలకు చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 4న ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.
BHNG: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడి చేసి ఇరాన్ సుప్రీం ఖమేనిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకదేశ సార్వమాధికారాన్ని దెబ్బతీసే హక్కు మరే దేశానికి లేదు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా బరితెగించి వ్యవహారిస్తుందన్నారు.
MLG: ఏటూరునాగారం(M)చిన్నబోయినపల్లి గ్రామ సమీపంలోని హునుమాన్ నగర్ వద్ద జాతీయ రహదారి పై HNK వైపు వెళ్తున్న ఇసుక లారీ అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చిన అడవి పందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పంది అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పంది శవాన్ని తీసుకెళ్లి పంచనామా నిర్వహించారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి ఆలయ 27వ వార్షికోత్సవాలు మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకలకు ముదిరాజ్ సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.
BHPL: రేగొండ మండలంలోని ప్రసిద్ధ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆదివారం BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నూతనంగా ఆలయ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.
VKB: దుద్యాల మండల కేంద్రం నుంచి సాగారంతండా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అసంపూర్తిగా పనులు వదిలివేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కంకర పరిచి వదిలివేయడంతో దుమ్మూధూళి కళ్లల్లో పడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.