NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి ఆలయ 27వ వార్షికోత్సవాలు మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకలకు ముదిరాజ్ సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.