KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియోపతి వైద్యరాలు పద్మశ్రీ మత ప్రచారం నిర్వహిస్తున్నారన్న విషయంపై విచారణ చేపడుతున్నామని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి నివేదిక అనంతరం వరంగల్లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆయుష్) అధికారులకు నివేదిక పంపుతామన్నారు. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.