• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చంపాపేట్లో సమస్యలు తెలుసుకున్న మధుయాష్కి గౌడ్

హైద్రాబాద్: ఎల్బీనగర్ పరిధి చంపాపేట డివిజన్ ఉదయ నగర్ కాలనీలో కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ పర్యటించారు. కాలనీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీలైనంత తొందరలోనే కాలనీలోని సమస్యలు తీరుస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.

February 7, 2025 / 07:54 PM IST

మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలి : ఆర్డీవో

KMR: ఎల్లారెడ్డి నర్సరిలో మొక్కల సంరక్షణ సక్రమంగా చేపట్టాలని ఆర్డీవో ప్రభాకర్ శుక్రవారం సూచించారు. మండలంలోని బ్రాహ్మణపల్లి నర్సరీని అయిన శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు సంసిద్ధం చెయాలనీ నిర్వహకులకు సూచించారు.

February 7, 2025 / 07:51 PM IST

ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలి: మంత్రి

MLG: మంగపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలనీ, పార్టీ లైన్‌లోనే ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.

February 7, 2025 / 07:16 PM IST

గుండె పోటుతో వ్యవసాయ కూలీ మృతి

NZB: వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం పొలంలో పని చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ శుక్రవారం తెలిపారు. పోలీస్ల వివరాల ప్రకారం మృతుడు అదే గ్రామానికి చెందిన మేక వెంకటేశ్వర్ రావు వద్ద 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

February 7, 2025 / 07:11 PM IST

శుభాష్ రెడ్డి‌ని సస్పెండ్ చేసిన హైకమాండ్

KMR: కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శుక్రవారం సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన హైకమాండ్. గత కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక మీటింగ్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై మరియు పార్టీని దుర్భాషలాడినందుకు హైకమాండ్ ఇట్టి విషయాన్నీ తీవ్రమైన కఠిన చర్యగా తీసుకొని సస్పెండ్ చేశారు.

February 7, 2025 / 07:03 PM IST

కిక్ బాక్సింగ్ పోటీల్లో బెల్లంపల్లి వాసి ప్రతిభ

MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ క్రీడాకారుడు రాసకొండ సంజీవ్ మరోసారి ప్రతిభ చూపి పోటీల్లో బహుమతి సాధించాడు. ఈనెల 1 నుండి 5 వరకు కేడి జాదవ్ ఇండోర్ స్టేడియం ఐజి కాంప్లెక్స్ న్యూఢిల్లీలో జరిగిన ఏడవ వాకో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ రిఫ్రి సెమినార్ లో పాల్గొని సర్టిఫికెట్, అవార్డు పొందారు. అతన్ని గ్రామస్తులు అభినందించారు. 

February 7, 2025 / 02:06 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం: పటేల్ రమేష్ రెడ్డి

SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తుందని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే సక్రమంగా నిర్వహిస్తే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

February 7, 2025 / 02:04 PM IST

వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ సాయినగర్ కాలనీకి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు గొప్ప మనస్సు చాటుకున్నారు. కాలనీకి చెందిన మధు(భాష ) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కాలనికి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు తలో రూపాయి కూడబెట్టి, 9,001 రూపాయలు, 50 కేజీల బియ్యంను బాధిత కుటుంబనికి అందించారు.

February 7, 2025 / 01:52 PM IST

‘తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలి’

NRML: తునికాకు సేకరణకు టెండర్లు పిలవాలని టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంభు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా డిసెంబర్ జనవరి నుంచి సేకరణ ప్రత్యేక సంబంధించి పనులను అటవీశాఖ మొదలు పెట్టేదని, ఈ ఏడాది మాత్రం ఆ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నదని అన్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి గిరిజన పేదలకు ఉపాధి కల్పించాలన్నారు.

February 7, 2025 / 01:48 PM IST

రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు: సీపీఐ

SRPT: పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.

February 7, 2025 / 01:48 PM IST

సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి

NRML: జిల్లాలోని 19 మండలాలలో ఎంపికైన 256 మందికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల సబ్సిడీని వెంటనే మంజూరు చేయాలని సీపీఎమ్  జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్ ద్వారా ఎంపిక చేసిన 2020-21 సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రుణాలను ఇప్పటివరకు మంజూరు చేయలేదని వాపోయారు

February 7, 2025 / 01:27 PM IST

కులగణన సర్వేపై బీజేపీ వినతి

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే బీసీల ఎదుగుదలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టే విధంగా, రాజకీయంగా అణిచివేసే విదంగా ఉన్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు. 

February 7, 2025 / 01:06 PM IST

మామిడి సాగు రైతులకు జిల్లా ఉద్యానవన అధికారి సూచనలు

KMM: జిల్లాలో మామిడి సాగును 32,105 ఎకరాలలో సాగుచేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి యం.వి. మధుసూదన్ తెలిపారు. ప్రస్తుతం మామిడి పూత నుంచి పిందె దశలో ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిక్కుడు పురుగు, తేనె మంచు పురుగు, తామర, బూడిద రోగం, పక్షి కన్ను తెగులు వంటి నివారణకు సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.

February 7, 2025 / 12:52 PM IST

కూసుమంచి ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు

KMM: కూసుమంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. మండల వైద్యాధికారిపై ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత సంవత్సరం పల్స్ పోలియో నిధులు పల్లెదావఖాన నిధుల అక్రమ వినియోగంపై విచారణ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

February 7, 2025 / 12:33 PM IST

చెరువుగట్టు దేవస్థానం ఆదాయ వివరాలు

SRPT: చేరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అగ్నిగుండంపై నడిచారు. వారు సమర్పించిన కట్నాలు రూ.1,03,350, హుండీ ఆదాయం రూ.60,580 వచ్చినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు.

February 7, 2025 / 10:19 AM IST