• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

స్ట్రీట్ లైట్ల సమస్యను పరిష్కరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

BHNG: ఆలేరు పట్టణ కేంద్రంలోని సిల్క్ నగర్ కాలనీలో వీధిలైట్లు లేకపోవడం వల్ల చీకటిగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక వాసులు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్‌కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి వీధిలైట్లను వేయించడం జరిగింది. పట్టణ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:04 PM IST

‘టైలరింగ్ వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి కృషి’

NLG: టైలరింగ్ వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. టైలర్స్ డే సందర్భంగా నకిరేకల్‌లోని మెయిన్ సెంటర్‌లో టైలర్స్ యూనియన్, మేరు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు. టైలరింగ్ వృత్తిదారులకు సమాజంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు.

February 28, 2026 / 01:03 PM IST

‘ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలి’

ASF: కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి శనివారం పలు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీల శుభ్రత, చెత్త తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వార్డులోనూ ప్రతిరోజూ పరిశుభ్రత పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పట్టణాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

February 28, 2026 / 01:02 PM IST

సంత్ సేవాలాల్ శోభాయాత్ర ర్యాలీ

RR: గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన, పరివార దేవతల విగ్రహ ప్రతిష్ఠాప, భోగ్ బండారో ప్రత్యేక పూజ కార్యక్రమం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ర్యాలీకి గిరిజన నాయకులు, మహిళలు, తండావాసులు తరలివచ్చారు.

February 28, 2026 / 01:01 PM IST

గచ్చిబౌలిలో అంతర్జాతీయ హాకీ సమరం

HYD: గచ్చిబౌలి హాకీ స్టేడియం మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్‌లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7.30 గంటలకు CM రేవంత్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించనున్నారు.

February 28, 2026 / 01:01 PM IST

గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి

KMM: వైరా మండలం సోమవారం గ్రామంలోని శ్రీ కానిపాకం విగ్నేశ్వర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లతో సిబ్బంది సరైన విధంగా ప్రవర్తించడం లేదని ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తరువాత వాచర్లు ఇవ్వడం లేదని, అడిగితే లేవని నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.

February 28, 2026 / 12:55 PM IST

దేవరకొండలో ఘనంగా టైలర్స్ డే

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ఉన్న కొంతమంది టైలర్స్ని శాలువాతో సత్కరించి అభినందించారు. టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టైలర్స్‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు.

February 28, 2026 / 12:54 PM IST

రామయ్య నిత్య కళ్యాణం వైభవంగా

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి, విశ్వక్సేన పూజ, కంకణధారణ తదితర కార్యక్రమాల మధ్య అర్చకులు నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

February 28, 2026 / 12:53 PM IST

FLASH: GHMC చట్టం స్థానంలో రానున్న కొత్త కోర్ అర్బన్ చట్టం

HYD: ORR పరిధి మూడు కార్పొరేషన్లకు వర్తించేలా GHMC చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, వాటర్ హార్వెస్టింగ్, చెరువుల అభివృద్ధి పనులను 99 రోజుల కార్యాచరణలో ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు.

February 28, 2026 / 12:50 PM IST

క్లిక్ చేసే ముందు ఆలోచించండి

RR: షాద్ నగర్ పట్టణంలోని కుంటపడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సింబయాసిస్ ఇంటర్‌నేషనల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేయడం మూలంగా నష్టపోవడం తప్ప ఏది ఉండదని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్లిక్ చేసే ముందు ఆలోచించాలని తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: సబ్ కలెక్టర్

KMR: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకాంక్షించారు. జుక్కల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, త్వరలో జరగనున్న వార్షిక పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు.

February 28, 2026 / 12:49 PM IST

MPDOకు డిప్యూటీ సీవోగా పదోన్నతి

RR: మొయినాబాద్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సంధ్యకు పదోన్నతి లభించింది. గత నాలుగేళ్లుగా మొయినాబాద్‌లో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఆమె కృషి, నిబద్ధత, పారదర్శకతకు గుర్తింపుగా డిప్యూటీ సీవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST

ఖండ శాఖల సంగమం విజయవంతం చేయాలి: రాంరెడ్డి

NRPT: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఊట్కూర్ ఖండలో నిర్వహించనున్న ఖండ శాఖల సంగమాన్ని విజయవంతం చేయాలని ఖండ సంఘచాలక్ శ్రీ రాంరెడ్డి కోరారు. ఖండ పరిధిలోని 56 గ్రామాలకు చెందిన స్వయం సేవకులు ఉదయం 7 గంటలకు జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఒకే వేదికపై సమావేశమవుతారని తెలిపారు.

February 28, 2026 / 12:48 PM IST

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేయించుకోవాలి: ఏడీఏ

KMM: పీఎం కిసాన్, కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వర రావు అన్నారు. శనివారం కామేపల్లి మండలంలో మద్దులపల్లి గోవింద్రాల నెమలిపురి గ్రామాల్లో పర్యటించి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణిలో నిలిచిందన్నారు.

February 28, 2026 / 12:48 PM IST

అంబులెన్స్ వాహనాలు సరిపోక కష్టంగా చివరి మజిలీ..!

HYDలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చివరి మజిలీ చాలా కష్టంగా మారిందని బాధితులు లబోదిబోమంటున్నారు. రోజు దాదాపుగా 50 కి పైగా కేసుల్లో మృతదేహాలకు పైగా పోస్టుమార్టం జరుగుతుంది. కానీ.. మృతదేహాలను తరలించేందుకు సరైన సంఖ్యలో అంబులెన్సులు లేకపోవడంతో, ప్రైవేటు అంబులెన్స్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2026 / 12:46 PM IST