NLG: టైలరింగ్ వృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. టైలర్స్ డే సందర్భంగా నకిరేకల్లోని మెయిన్ సెంటర్లో టైలర్స్ యూనియన్, మేరు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు. టైలరింగ్ వృత్తిదారులకు సమాజంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు.