KMR: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకాంక్షించారు. జుక్కల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, త్వరలో జరగనున్న వార్షిక పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు.