JGL: కోరుట్ల పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోరుట్ల పట్టణంలోని శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, పలు ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితులను కలెక్టర్ గురువారం పరిశీలించారు.
WNP: కేవలం రెండేళ్లలో వనపర్తి ఆర్టీసీ డిపోకు దాదాపు రూ.10 కోట్ల పైనే ఆదాయం సమకూరిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గత BRS హయంలో దివాలా తీసిన ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. వనపర్తి డిపోకు సంబంధించి రోజుకు రూ.4 లక్షలు ఉండే ఆర్టీసీ ఆదాయం నేడు రూ.30 నుంచి రూ.35 లక్షలకు పెరిగిందన్నారు.
BSK: బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్లో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్పుతో పాటు నిరుపేదలకు ఉపాధి హామీ లేకుండా చేయాలని కుట్ర పన్నుతుందని తెలిపారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.
BDK: బూర్గంపాడు మండలం పోలారం గ్రామంలో వర్సా రమణయ్య – సుజాత దంపతుల కుమారుడు రాజేష్ మరియు అక్షిత వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
GDWL: జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని R&R కమిషనర్ శివకుమార్ నాయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న సుమారు 1000 ఎకరాల భూసేకరణ ముగిస్తే, నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లిస్తుందని వారు స్పష్టం చేశారు.
BHPL: స్తంభంపల్లి గ్రామంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికురాలైన లక్ష్మి (40) తన భర్తకు నిన్న గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు SI మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
SDPT: హుస్నాబాద్ పట్టణంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని రెడ్డి కాలనీలో బైక్పై వెళ్తున్న వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడులు చేశాయి. ఈ దాడిలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలో కోతుల తీవ్రత అధికంగా ఉందని, పలుమార్లు అధికారులకు, నాయకులకు తెలిపినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ ఓరల్ డెంటల్ హెల్త్ స్క్రీనింగ్ & ఎడ్యుకేషన్ క్యాంప్ను గురువారం నిర్వహించారు. NSS సెల్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు హాజరై మాట్లాడారు. దంత పరీక్షలు, నోటి పరిశుభ్రత ఆరోగ్యకరమైన నోటి అలవాట్లను వివరించారు.
NLG: చిట్యాలలో జరుగుతున్న ఉచిత గాలికుంటు నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ డా.జి.వి.రమేష్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాడి రైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు డా.అభినవ్, డా.అమరేందర్, రైతులు పాల్గొన్నారు.
SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్యతో ఇవాళ సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు గురువారం సమావేశమయ్యారు. రెండు నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులపై కలెక్టర్తో చర్చించారు. నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.
WNP: కొత్తకోట మండలం పాలెం గ్రామంలో అగ్రికల్చర్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కృపాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ప్రారంభించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాలలో ఆసుపత్రి నిర్మాణాలను చేపడుతుందని అన్నారు.
PDPL: TG కౌన్సిల్ ఎన్నికల్లో గోదావరిఖని బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది చందాల శైలజ మెంబర్గా విజయం సాధించారు. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలోనే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక మహిళా న్యాయవాది విజయం సాధించడం ఇదే మొదటిసారి. దీంతో పలువురు న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
HYD: రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉద్యానయాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పద్ధతులు, యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలన్నారు.
ADB: గాదిగూడ మండలంలోని ఝరి గ్రామంలో గురువారం జిల్లా రిమ్స్ ఆసుపత్రి వైద్యులు కలిసి ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి సంబంధిత మందులను పంపిణి చేశారు. అదేవిధంగా కంటి, దంత పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డా. గజానన్, సుందర్ చైతన్య, సచిన్ రెడ్డి, వంశీకృష్ణ, ఆదర్శ్ రెడ్డి, భాగ్యలక్ష్మి ఉన్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో ఇవాళ లిఫ్ట్ వైర్ తెగి జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆరుగురు మీడియా ప్రతినిధులు 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన జర్నలిస్టులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.