SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్యతో ఇవాళ సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు గురువారం సమావేశమయ్యారు. రెండు నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులపై కలెక్టర్తో చర్చించారు. నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.