NRML: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు.