SRD: జిన్నారం మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం 5 కే రన్ను మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. ఈ రన్లో జిన్నారం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు జీవన్, తేజ, రుత్విక్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి నగదు పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కమిషనర్ తిరుపతి ఉన్నారు.