NLG: చింతపల్లి మండలం కిష్టరాయనపల్లి పల్లి గ్రామానికి చెందిన చక్కని హన్మంతు మృతి బాధాకరం అని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. శుక్రవారం హన్మంతు భౌతిక కాయనికి పూలమాల వేసి, నివాళర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ నర్సింహా రెడ్డి, సర్పంచులు సంతోషి రమేష్, శ్రీను, తదితరులు ఉన్నారు.