SDPT: హుస్నాబాద్ బస్టాండ్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కొండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని తెలిపారు. ఇళ్లు, దుకాణాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేస్తే భద్రత మెరుగుపడుతుందని చెప్పారు. కెమెరాల ద్వారా నేరాలను త్వరగా గుర్తించి దర్యాప్తు సులభమవుతుందని వివరించారు.