HNK: ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని కేయూ వీసీ ప్రతాపరెడ్డి అన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం గ్రామీణ ఉత్పత్తుల సంతను వీసీ ప్రారంభించారు. కోవిడ్ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచిందని, సేంద్రియ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, పాలకమండలి సభ్యురాలు అనితారెడ్డి, నిమ్మల శ్రీనివాస్ ఉన్నారు.