MDK: కొల్చారం మండలం కిష్టాపూర్ బస్టాండ్ సమీపంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్బంగా ఏడుపాయల నుంచి మెదక్ వరకు నిన్న పెద్ద మొత్తంలో రౌండ్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామానికి చెందిన అక్కం నవీన్, ప్రశాంత్ వాటిని తొలగిస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.