KMM: కామేపల్లి మండల పరిధిలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికలలో మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి బి. తారా దేవి తెలిపారు. పంటల సాగులో డ్రోన్ వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించి చైతన్య పరుస్తారన్నారు.