BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మూడో రోజు శుక్రవారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జగత్ రక్షకుడైన శ్రీవారు ఆదిశేషులుపై తిరువీధి సేవలో మంగళ వాయిద్యాలతో, శాస్త్రీయ నృత్యాలతో, కనుల పండగగా ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించి తరించారు.