SRD: పర్యావరణ పోటీల్లో సదాశివపేట మండలం నిజాంపూర్ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం దక్కింది. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాదులో శనివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిజాంపూర్ పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలపై రామకృష్ణ వివరించారు.