ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రాన కీరవాణి అద్భుతమైన, ప్రజారంజకమైన బాణీలు కడుతున్నారా అంటే లేదనే సమాధానమే సోషల్ మీడియా అంతా వినబడుతోంది. అస్సలు మెగాఫాన్స్ అయితే కీరవాణిని క్షమించే పరిస్థితుల్లో లేనే లేరనే వాతావరణం సోషల్ మీడియాలో బాహాటంగా కనిపిస్తోంది.
సంగీత దర్శకుడు కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చిన దగ్గర్నుంచీ సినిమా పరిశ్రమలో ఆయన పేరుప్రఖ్యాతుల స్థాయే మారిపోయింది. ఆయన్ని అందరూ దైవంలా భావిస్తున్నారు. ఆయన హార్మణీ పట్టుకుని కూర్చుంటే చాలు మరో ఆస్కార్ తమ సినిమాకి వచ్చెస్తుందన్నది ప్రగాఢమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. ఒక్క విషయాన్ని ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు. ఆస్కార్ అవార్డు వచ్చినంత మాత్రాన కీరవాణి అద్భుతమైన, ప్రజారంజకమైన బాణీలు కడుతున్నారా అంటే లేదనే సమాధానమే సోషల్ మీడియా అంతా వినబడుతోంది. అస్సలు మెగాఫాన్స్ అయితే కీరవాణిని క్షమించే పరిస్థితుల్లో లేనే లేరనే వాతావరణం సోషల్ మీడియాలో బాహాటంగా కనిపిస్తోంది.
నెటిజన్లు ఎంతవరకూ వెళ్తున్నారంటే అస్సలు కీరవాణి రాఘవేంద్రరావు సినిమాలకీ, రాజమౌళి సినిమాలకి తప్ప మరే సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చారని కూడా వాళ్ళు మరో మెట్టెక్కి ప్రశ్నిస్తున్నారు. అంటే సోషల్ మీడియా ఎంతగా పరిశీలించి, పర్యవేక్షించి, ప్రవర్తిస్తోందో దీన్ని బట్టి అర్ధమవడం లేదా? నిజమే అనిపిస్తుంది నెటిజన్ల మనోభావాలు చూస్తుంటే. దర్శకుడు బ్రహ్మాండంగా చిత్రీకరిస్తే, ఆ చిత్రీకరణలో ఇమిడి ఉన్న నైపుణ్యం వల్లనే కీరవాణి బాణీలు కూడా రక్తికట్టి, రాణిస్తున్నాయనేది వారి విశ్లేషణ.
ఎందుకంటే తాజాగా కీరవాణి సంగీతం చేసిన విశ్వంభర చిత్రానికి ఆయన పాటలు ఏమాత్రం హెల్ప్ కాలేదన్నది పబ్లిక్గా కనిపించింది. మెగాఫాన్స్ అయితే దెబ్బకి నీరుకారిపోయారు. నిట్టనిలువునా కుప్పకూలిపోయారు. దర్శకుడికైనా, నిర్మాతకైనా సంగీతం మీద ఎంతో కొంత అవగాహన ఉండితీరాలి. పూర్తిగా సంగీత దర్శకుడిపైనే వదిలేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. దర్శకుడు రాఘవేంద్రరావు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే పెట్టెబేడా సద్దుకుని ఏ తిరుపతి పుణ్యక్షేత్రానికో, మరో చోటకో సంగీత దర్శకుడిని పట్టుకుని పారిపోతారు. ట్యూన్లన్నీ కుదిరేవరకూ ఎవ్వరి ముఖం చూడనే చూడరు. ఇక్కడ యువి క్రియేషన్స్ అధినేతలు ఏమీ పట్టించుకోగలిగే సామర్ధ్యం ఉన్నవాళ్ళు కాదు. దర్శకుడా వశిష్టకిది పెద్ద అగ్నిపరీక్ష. సాక్షాత్తు ఆస్కార్ అవార్డ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడి ముందు ఏం మాట్లాడగలడు పాపం. ఇప్పుడు అందరి దగ్గరా చెప్పుకుని వాపోతున్నాడట. తనకి కూడా ఆ పాటలు నచ్చలేదని, కానీ చెప్పలేకపోయానని చెప్పుకుంటున్నాడని సన్నిహితులు చెబుతుంటే నిజంగానే జాలి కలుగుతుంది. చిరంజీవిగారు మరి విన్నారు కదా….మ్యూజిక్ సిట్టింగ్లకి కూడా హాజరయ్యారు కదా. ఆ వీడియోలు కూడా వచ్చాయి కదా. మరి ఏమైంది? చిరంజీవిగారు చెప్పలేదా ట్యూన్ బాగులేదని. ఆయన కూడా ఆస్కార్ మైకంలో పడిపోయారనేది అందరూ చేస్తున్న కామెంట్.
మరో వైపున హరిహరవీరమల్లు. అదో పెద్ద అగాథం. ఆ పాటలు కూడా చౌచౌగానే ఉన్నాయి తప్పితే ఏమంత పొడిచెయట్లేదు. గతంలో ఎఎం రత్నం నిర్మించిన భారీ చిత్రాలన్నిటికీ దర్శకుడు శంకర్. సంగీత దర్శకుడు రెహ్మన్. వాళ్ళ కాంబినేషనే కాంబినేషన్. పాటలన్నీ అదిరిపోయాయి. సినిమాలకి తిరుగులేని క్రేజ్ని తెచ్చాయి. ఆ కోవలో చూస్తే హరిహరివీరమల్లు చిత్రానికి కీరవాణి ఇచ్చిన పాటలు మామూలుగా మొహం మొత్తలేదు. ఓరి దేవుడా అని పోస్టులు పెడుతున్నారు పవర్ స్టార్ అభిమాన ప్రపంచం.
ఒక్కరికి కాదు, ఇద్దరు మెగా బ్రదర్స్ చిత్రాలకి కూడా కీరవాణి మామూలు రాడ్ దించలేదని ఆపోజిట్ హీరోల ఫ్యాన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. ఇంక ఈ ఇద్దరినీ దేవుడే కాపాడాలి.