నైజీరియన్ దేశస్తుడి వద్ద నార్కొటిక్ బ్యూరో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నిందితుడి వద్ద రూ.1.25 కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. అలాగే అతని నుంచి 2 సెల్ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇమ్మాన్యుయేల్ అలియాస్ మ్యాక్స్వెల్గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.