BPT: కొరిశపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్లు అందజేయడం జరుగుతుందని ఎంఈవో పున్నయ్య సోమవారం తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర స్కూల్ కిట్స్ను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు.