AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 78,631 మంది భక్తులు దర్శించుకోగా.. 31,247 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.