కడప: కొండాపురం మండల పరిధిలోని రామిరెడ్డిపల్లెలో వెంకటరెడ్డికి చెందిన మట్టిమిద్దె ఒక్కసారిగా కూలిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిమిద్దె బాగా నానడం వల్ల పడిపోయి ఉంటుందన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం కొత్త ఇంటిని మంజూరు చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.