NDL: కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గురువారం పర్యటించారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్త నీలం సంజీవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నీలం సంజీవరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. బాధితుడికి వైసీపీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.