NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారిని ప్రత్యేక పూలమాలలతో అలంకరించి భక్తులు పూజలు చేశారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.