ASR: కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జెస్సిక, వివేక్ నాగసాయి, జ్యోత్స్న అనే ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. విద్యార్థులను ఎంఈవో రాంబాబు, ఉపాధ్యాయులు తిరుపతిరావు, కృష్ణపడాల్ తదితరులు శుక్రవారం అభినందించారు. ఈ విద్యార్థులకు సంవత్సరానికి రూ.12వేలు చొప్పున నాలుగేళ్లు స్కాలర్షిప్ వస్తుందన్నారు.