ATP: బుక్కరాయసముద్రం మండలం దయ్యలకుంటపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, టీడీపీ సీనియర్ నాయకులు పెద్దప్ప గుండె పోటుతో మృతిచెందారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయానికి ఎమ్మెల్యే శ్రావణి శ్రీ నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. గ్రామస్థులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా నివాళులర్పించారు.